Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, క్యాంపు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ZP హై స్కూల్ లొ IEC campaign on హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా చిలకలూరిపేట ఏరియా హాస్పిటల్ ICTC కౌన్సిలర్ k. హనుమంత్ రావు మాట్లాడుతూ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017,ART మందులు, APSACS app ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ ,అలానే చెడు వ్యసనాలకు, డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలు చెబుతూ అవగాహన చేయడం జరిగింది నిర్వహించడం జరిగింది. ZP హై స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రావు మరియు ఇంచార్జ్ కృష్ణ లోకల్ ఆషావర్కర్స్,క్యాంపు సంస్థ మేనేజర్ k. పవన్ కళ్యాణ్ ANM ఊహ ORW sk. షామీమ్ పాల్గొన్నారు.