

జనం న్యూస్ ఆగష్టు 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్య క్షుడు పొనుగోటి రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈ నెల 31న రవీంద్రభారతిలో బీసీల యుద్ధభేరి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపార్టీ పరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇస్తామంటే ఒప్పుకునేది లేదని, రాజ్యాంగ హక్కు ప్రకారం చట్టపరమైన హక్కుగా 42 శాతం రిజర్వే షన్లు ఇవ్వాలని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో ఘర్షణ వైఖరి అవలంబించకుండా సాధించే మార్గాలు పరిశీలిం చాలని సూచించారు. అఖిల పక్ష సమావేశాలు, బీసీ సంఘాల సమావేశాలు, న్యాయ నిపుణులు, అడ్వకేట్లతో సమావేశాలు జరిపి పరిష్కార మార్గాలు సాధించాలని కోరారు. బీసీల యుద్ధభేరికి వివిధ బీసీ సంఘాల నాయకులు, బిసి ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థి సంఘాలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి, కోదాడ నియోజకవర్గం బీసీ యువజన సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు వీరయ్య, మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.