Listen to this article

జుక్కల్ లో టిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన జుక్కల్ సెప్టెంబర్ 2 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో మంగళవారం రోజు గత రెండు రోజులు నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అయినటువంటి కేసీఆర్ గారిపై చేస్తున్నటువంటి అసత్య ప్రచారం మరియు కాలేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ ఇంకోరి బురదజల్లే మాటలను వ్యతిరేకిస్తూ కాలేశ్వరం పై వేసిన కమిషన్ మరియు తప్పుడు మాటలను వ్యతిరేకిస్తూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మాజీ ఎంపీపీ నిలు పాటిల్ ఆధ్వర్యంలో జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి బసవేశ్వర చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి బసవశ్యర్ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం జరిగింది మాజీ ఎంపీపీ నిలు పటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి మాటలను మానుకోవాలని ముందు మీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల్లో వెళ్లాలి రాబోయే కాలంలో మీకు డిపాజిట్ కూడా రాదు కాబట్టి ఇటువంటి మాటలు మానుకొని అభివృద్ధి పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని హితోపలికారు ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు