Listen to this article

జనం న్యూస్ 07 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరంలో 3 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన సంయుక్త సర్వే శనివారం జరిగింది.
నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య, ఇతర అధికారులు, ఈస్ట్‌ కోస్ట్‌ డీఆర్‌ఎం కార్యాలయం నుంచి వచ్చిన డిప్యూటీ సిఈ, ఈశ, తదితరులు సర్వేలో పాల్గొన్నారు. వేణుగోపాలపురం డైట్‌ కాలేజీ, గాజులరేగ రాళ్లమాలపల్లి ఎఫ్‌సీఐ గొడౌన్‌ వద్ద, వీటి అగ్రహారం మార్కెట్‌ యార్డు వద్ద సర్వే చేశారు.