Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

మునగాల మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గణేశుడి నవరాత్రుల అనంతరం శనివారం నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమాలు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రశాంతంగా ముగిసాయని ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.పోలీస్ శాఖ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించిన పలు గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం కలగకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారని తెలిపారు.