జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి నేను కొప్పుల గ్రామం నుండి పరకాల నేషనల్ హైవే మధ్యన చలివాగు పై బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎస్ టి ఎస్ డి ఎఫ్ 2023-24 నుండి రూ.574 లక్షలు , కొప్పుల గ్రామం నుండి పరకాల వరకు బిటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ.585 లక్షలు మంజూరు చేయించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించడం జరిగింది అన్నారు.జరుగుతున్న పనులను ఆపివేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నేను నిధులు తెచ్చిన అంటూ మేము వేసిన శిలాఫలకాల పక్కనే శిలాఫలకాలు వేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం ఏంటని ఏద్దేవా చేశారు.నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు హుస్సేన్ పల్లి నుండి మైలారం వరకు వయా పెద్ద చెరువు కట్ట మీదుగా కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టరాజ్యంగా పనులు చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ నాయకులకు సహకరించని అధికారులను ట్రాన్స్ఫర్ చేయిస్తూ వారిపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు అన్నారు. ఎస్సిలకి సంబంధించిన స్మశాన వాటికను కూడా ఆక్రమించుకున్నారు.అంటే అధికార పార్టీ నాయకులు ఏదీ చేసిన మాఫ్ అనే ధోరణి నడుస్తుంది. ఇరిగేషన్ అధికారులు , రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొప్పుల గ్రామంలో వేసిన శిలా ఫలకాలను చూసి శిలాఫలకాల మోజులో ప్రజలను ఏమార్చుతున్నారు అంటూ చురకలు వేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి శాయంపేట మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి దూదిపల తిరుపతి రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…


