Listen to this article

బిచ్కుంద సెప్టెంబర్ 20 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటనామస్ లో శనివారం రోజున బతుకమ్మ సంబరాలు మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపల్ కె. అశోక్ మాట్లాడుతూ బతుకమ్మ విష్టతను,మన సంస్కృతి, సాంప్రదాయ ల గొప్పతనం తెలుసుకొని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థుల పై ఉందని సూచించారు. విద్యార్థులు తాము పూలతో అలంకరించిన బతుకమ్మలను ప్రదర్శించి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక ,అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు