జుక్కల్ సెప్టెంబర్ 27 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రం మార్కండేయ మందిరం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం.మార్కండేయ మందిరం లోజరిగిన కార్యక్రమం లో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొని బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి అయన సేవలను కొనియాడారు.జిల్లా పద్మశాలి సంఘం కార్యదర్శి బోడ సాయిలు ముఖ్య అతిథులు గా పాల్గొని బాపూజీ సేవలను, తెలంగాణ సాధన మాలిదశలో కొండా లక్ష్మణ్ చేసిన పోరాటం గురించి వివరించారు. స్వాతంత్ర్య పోరాటం లో బాపూజీ బాపూజీ పాలు సార్లు జైలుకు వెళ్లారని అన్నారు.తెలంగాణ సాధనకోసం 95 ఏళ్ల వయస్సులో వణుకు పెట్టె చలిలో సైతం ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారని అన్నారు. ప్రభుత్వం అయన సేవలను గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని బోడ సాయిలు పేర్కొన్నారు. ఉద్యాన యూనివర్సిటీ కీ కొండలక్ష్మణ్ పేరు పెట్టారని అన్నారు.బాపూజీకి భారతరత్న బిరుదును ప్రకటించాలని జుక్కల్ పద్మశాలి సంఘం సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలిసంఘం నాయకులు దోమల అశోక్, మెరిగే బాలాజీ,యూ. హన్మాండ్లు,యూ.లక్ష్మణ్. వెంకటి, మహేందర్,డి హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు




