కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో బిసిలకు న్యాయం
చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం
జూలూరుపాడు, జనం న్యూస్, :
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని జూలూరుపాడు మండలం, కాకర్ల గ్రామనివాసి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓబిసి సెల్ జిల్లా చైర్మన్ అల్లాడి నరసింహారావు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కకాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల రాజకీయ రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలు మరియు బిసిల అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు మంత్రివర్గం నిరంతర కృషితో ఈ నిర్ణయం సాధ్యమైందని అన్నారు.లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చిన వెంటనే అమలు చేశారని ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిజాయితీకి నిదర్శనం అని అన్నారు.దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పకడ్బందీగా కులగణన సర్వే చేపట్టి బీసీ కమిషన్ సేకరించిన నివేదికల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయడం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు.బీసీ సమాజం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలియచేశారు.


