జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఆదివారం ఏఐ వైఎఫ్ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ,ఏఐవైఫ్, దళిత, గిరిజన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూపన్నెండేళ్లకే భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టి , పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగులేశాడు. ఇరవైమూడేళ్లకే ప్రాణత్యాగం చేసి యువతరంలో జ్వాలను రగిల్చిన విప్లవ యోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు.1907 సెప్టెంబర్ 28 వ నేటి పాకిస్తాన్లోని లాయల్పూర్ జిల్లా బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించారు . చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తినిఇనుమడింపచేసుకున్నాడు భగత్ సింగ్. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ విప్లవవీరుడి త్యాగం ఇంకా సజీవంగానే ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది. కోట్లాదిమందిలో తెగువ నింపిందన్నారు.12 ఏళ్ల వయసులోనే జలియన్ వాలాబాగ్ దారుణాలను చూసి భగత్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్సింగ్కు నచ్చలేదన్నారు.1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించారన్నారు.1928లో సైమన్ కమీషన్ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో.. లాలాలజపతిరాయ్ చనిపోవటంతో భగత్సింగ్ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్ వేశారు. విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారన్నారు.బ్రిటీష్ హై కమిషనర్ సాండర్స్ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్సింగ్తో పాటు రాజ్గురు, సుఖ్దేవ్లను 1931 మార్చి 23న లాహోర్లో ఉరితీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్సింగ్ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారని, కానీ భగత్సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్థాన్ పోలీస్ శాఖ లాహోర్ న్యాయస్థానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా… తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడని,చరిత్ర వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలని, ఈతరం యువత ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పేర్కొన్నారు.


