Listen to this article

జనం న్యూస్: జనవరి 29 బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:జాతీయ సాహిత్య పరిషత్ 38వ వార్షికోత్సవం ఫిబ్రవరి 2 ఆదివారం రోజున సాయంత్రం 4గంటలకు సరస్వతి శిశు మందిర్ సిద్దిపేటలో జరుగుతుందని జాతీయ సాహిత్య పరిషత్ కవులు బుధవారం తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శిశుమందిర్ వద్ద ఆవిష్కరించి ప్రధాన కార్యదర్శి రాజేశం మాట్లాడుతూ 38వ జాసాప వార్షికోత్సవానికి జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయరాజు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాజుల రవీందర్ తదితరులు హాజరవుతారని అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం అందించే సాహితీ పురస్కారాలలో భాగంగా తడకమడ్ల సాంప్రదాయ సాహితీ పురస్కారం – అవధాని అవుసుల భానుప్రకాష్ ( మేడ్చల్)కు, ఐతా భారతి చంద్రయ్య సాంప్రదాయ కథా పురస్కారం – కూర చిదంబరం (హైదరాబాద్) కు, ఎన్నవెళ్లి బాలసాహిత్య పురస్కారం – గరిపల్లి అశోక్ (సిద్దిపేట) లకు నగదు, ప్రశంసాపత్రాలు జాసాప వార్షికోత్సవంలో అందించనున్నట్లు తెలుపుతూ అలాగే వెన్నెల గువ్వలు బాలల కథలు పుస్తకావిష్కరణ కలదని కవులు, రచయితలు, సాహితీప్రియులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో జాసాప కవులు ఐతా చంద్రయ్య, ఎన్నవెళ్ళి రాజమౌళి, వరుకోలు లక్ష్మయ్య, కొర్తివాడ రాజేందర్, బస్వ రాజ్ కుమార్, నల్ల అశోక్, దాసరి రాజు, అనిశెట్టి సతీష్ కుమార్, బైరి రమేష్, చీకోటి రాములు, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.