

మండల పరిధిలోని రాజుపాలెం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు స్వేచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ చల్లా కోటయ్య మాట్లాడుతూ విద్యార్థులు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్రతి ఒక్క వ్యక్తి ఒక మొక్కను నాటాలని మత్తుమందుల వినియోగానికి అలవాటు పడవద్దని ప్రతి ఒక్కరూ పట్టుదలతో క్రమశిక్షణగా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయిరాలు టి రత్నమ్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ డైరెక్టర్ నాళ్ళ భానుచందర్ పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి అనేక సలహాలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రేమిడిచర్ల హెడ్మాస్టర్ కే శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు