Listen to this article

జనం న్యూస్ 07 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య సెక్యూలరిజం ను మనువాదం గా మార్చే కుట్రలకు తెరాలేపడం అంటేనే రాజ్యాంగం పైన దాడి చేయడమే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే – ఇక దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు రక్షణ ఎక్కడ ? సోమవారం సుప్రీంకోర్టులో ఓ కేసు నిమిత్తమై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై ఓ వ్యక్తి అనూహ్యంగా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నావంటూ చెప్పుతో దాడి చేయడానికి పాల్పడడం హేయమైన చర్య అని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మండిపడుతూ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వ్యక్తి తన సనాతన ధర్మం పై జస్టిస్ గవాయ్ పట్ల ఏదైనా ఇబ్బంది కలిగించివుంటే చట్టప్రకారంగా కోర్టులోనే పిటిషన్ వేసి పోరాడలే కానీ ఇలా పిరికివాడిలా చేతకానితనంలా చట్టాలను తుంగలో తొక్కుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై ఈ విధంగా దాడికి పూనుకోవడం సరికాదన్నారు. భారత న్యాయవ్యవస్థకే అవమానం అని అన్నారు.సుప్రీంకోర్టులో ఇంత జరిగినా కానీ మిగతా కేసు విషయంపై మీ వాదనలు వినిపించండి అంటూ లాయర్ల ను సూచిస్తూ ఇలాంటివి నాపై ఏమాత్రం ప్రభావితం చేయవని చెప్పడం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ కి చట్టం పట్ల,విధి నిర్వహణ పై గొప్ప నిబద్ధత అని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.