Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 14 సంగారెడ్డి జిల్లా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ తన తండ్రి నందారం మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ మహిళా భవనాన్ని మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.నియోజకవర్గంలోని ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముదిరాజులకు సముచిత ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు.
తండ్రి జ్ఞాపకార్థం భవనాన్ని నిర్మించడం పట్ల నరసింహ గౌడ్ ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.