పత్తి ధర క్వింటాలకు రూ, 7220 ప్రకటన
మద్నూర్ అక్టోబర్ 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ పరిధిలోని కృష్ణ న్యాచురల్ ఫైబర్ ప్రైవేట్ పత్తి మిల్లు లో బుధవారం ప్రవేట్ పరంగా పత్తి కొనుగోలను ప్రారంభించారు పత్తి ధర క్వింటాలకు రూ, 7220 ప్రకటించి కొనుగోలు జరిపారు ముందుగా పత్తి మిల్లు యజమాని కుటుంబ సభ్యులంతా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మార్కెట్ కమిటీ అధికారులు పత్తి ప్రైవేటు కొనుగోళ్ల ఖరీదు దారులు కలిసి పత్తిని పరిశీలిస్తూ ధరను ప్రకటించారు ఈ పత్తి కొనుగోలు ప్రారంభోత్సవంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజు మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు సిబ్బందితోపాటు ప్రైవేటు పత్తి మిల్లుల ఖరీదుదారులు కమిషన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు


