Listen to this article

జనంన్యూస్. 15.సిరికొండ.

నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామం లో. పాత్రికేయుల సమావేశం..
బీడీ కార్మికుల వద్దవెయ్యి బీడీలకు అదనంగా ₹10 వసూలు చేసే పద్ధతికి, బలవంతంగా తినుబండారాల వ్యాపారాన్ని స్వస్తి పలకాలి, సరిపడా మంచి తునికాకు ఇవ్వాలి., తెలంగాణ ప్రగతిశల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్..దేశాయ్ బీడీ ఫ్యాక్టరీకి చెందిన వేలాదిమంది కార్మికులను యజమాన్యం నిలువు దోపిడిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యాలయం. గడ్కోల్ లో పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది… ఈ సందర్భంగా .జిల్లా కార్యదర్శి R, రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కుటీర పరిశ్రమ.. కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని చట్ట విరుద్ధంగా దేశాయి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం 1000 బీడీలకు పది రూపాయలు తక్కువ ఇవ్వడము (చట్టానికి దొరకకుండా) నిలువు దోపిడీ అవుతుందని తీవ్రంగా విమర్శించారు… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముడి సరుకు తుట్టిని (ఆకు తక్కువ పడితే కొనుగోలు చేసి బీడీలు ఇవ్వాలి.) కార్మికులు కొనుగోలు చేసి బీడీలు చేసి ఇవ్వాలి ఇది 100కు 100% కార్మిక చెట్టవ్యతిరేక చర్యఅవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు..వీటితో పాటు బీడీ యజమాన్యం తినుబండారాలైన కురుకురే.. దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు.. కారా పాకెట్లు తప్పనిసరి కొనుగోలు చేసే విధంగా బలవంతంగా అంటకట్టే పద్ధతి సమంజసం కాదని ఈ పద్ధతి గత పది సంవత్సరాలుగా కొనసాగుతుందని కోట్లాది రూపాయలు కార్మికులకు నష్టం చేస్తున్నారని అన్నారు..అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల నష్టపరిచే ఈ పద్ధతుల్ని మానుకోవాలని కోరిన ఫలితం లేకపోవడంతో రేపు అనగా 16 అక్టోబర్ రోజున ఛలో రేంజ్ ఆఫీసు డిమాండ్ చేస్తామని అన్నారు.. దీనికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ పాత్రికేయ మిత్రులు సమావేశంలో… తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు..B, కిషోర్, M, లింబాన్న,కిరణ్,.. తదితరులు పాల్గొన్నారు….ఉద్యమ అభినందనలతో…M, అనీష్