Listen to this article

జనం న్యూస్ 31 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్‌ కేసులో ఐదుగురు ముద్దాయిలును విశాఖ టూటౌన్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో విజయనగరానికి చెందిన పెదగాడి శ్రీను, మద్దిలపాలెంకు చెందిన గొర్లె నరేశ్‌, వన్‌ టౌన్‌ ఏరియాకు చెందిన గంగిరీ ప్రస్‌ కళ్యాణ్‌, సుబ్బలక్ష్మి నగర్‌కు చెందిన నీలగిరి వెంకటలక్ష్మి, ఆరిలోవకు చెందిన గంగిరి పద్మ ముద్దాయిలుగా ఉన్నారు. పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు.