Listen to this article

గంటూరు, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నరెడ్కో, క్రెడాయ్‌ వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.