జుక్కల్ అక్టోబర్ 29 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో నూతన పోస్ట్ ఆఫీస్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఉత్తరాలు, పార్శిళ్లను పంపడం మరియు స్వీకరించడం, డబ్బు బదిలీ సేవలు, పొదుపు ఖాతాలు, బీమా పథకాలు మరియు బిల్లు చెల్లింపులు వంటి అనేక రకాల సేవలను అందిస్తున్నారని తెలిపారు.పోస్ట్ ఆఫీస్ లు అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు




