జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరంలోని తననివాసమైన సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో కార్తీక మాస గోపాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు * మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , ఆయన సతీమణి శ్రీమతి మజ్జి పుష్పాంజలి , అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* గోపాష్టమి వేడుకలులో పాల్గొని శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన గోపాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.


