Listen to this article

ఎస్ఐ దుర్గారెడ్డి,

జనం న్యూస్,అక్టోబర్ 31,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో శుక్రవారం ఎస్ఐ దుర్గా రెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక 150 వ జయంతిని పురస్కరించుకొని టుకె రన్,ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్,భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌ లోని నాడియార్‌లో జన్మించారని అన్నారు. సర్దార్ పటేల్,ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసిన మహానీయుడని అన్నారు.హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత పటేల్,కె దక్కిందని అన్నారు.ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా, మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలు పంచుకున్నారని అన్నారు.బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించేలా చేశారని అన్నారు.బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారని అన్నారు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు.భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించారు.రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారు అని అన్నారు.స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ,నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, భారత ఉప ప్రధాన మంత్రి గానూ బాధ్యతలను నిర్వహించారు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశారు.నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించారు.నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనారు.కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబర్ 15న మరణించారు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువజన సంఘాల నాయకులు,విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.