బిచ్కుంద, నవంబర్ 4:–( జనం న్యూస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను మంగళవారం నాడు ఆర్ అండ్ బి శాఖ ఈ ఈ మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్ ను సెంట్రల్ లైటింగ్ పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్తు స్తంభాలు, మిషన్ భగీరథ, ఓ ఎఫ్ సి లైన్ ఉండటంవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి ఈ వినోద్, ఏఈ భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.


