Listen to this article

జనం న్యూస్ 07 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్‌ సీఐ సూరి నాయుడు సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ జంక్షన్‌లలో వాహనదారులకు గురువారం అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. తాగి వాహనాలు నడపొద్దని..పైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.