Listen to this article

శివ నామస్మరణతో మృత్యువును జయించిన మార్కండేయ మహర్షి

జనం న్యూస్,పీబ్రవరి 01,కంగ్టిసంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని శ్రీ మార్కండేయ మందిరంలో మార్కండేయ జయంతి సందర్భంగా శనివారం పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో వేద పండితులచే ప్రత్యేక అభిషేక పూజలు చేసి ధూప దీప నైవిద్యాలు సమర్పించి మంగళ నిరంజనాలు అర్పించారు.ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ మృకండ మహర్షి సార్థక నామధేయుడు.ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని (దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం) తీర్చుకొనేవి. మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండ మహర్షి అని పిలిచేవారు.మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య.వారికి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశికి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు మృకండ మహర్షి,వారణాశిలో రెండు లింగాలు ప్రతిష్ఠించి,శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు.మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి, సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుదైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహదేవుడు సంతోసించి పుత్రుడ్ని ఇచ్చాను అని పల్కి అదృశ్యమౌతాడు.మార్కండేయునికి సప్తర్షులు ఆశీర్వచనంమహాదేవుని మాటల ప్రకారం,మరుద్వతి గర్భవతి అయింది.9 నెలల తర్వాత దివ్య తేజస్సుతో ఒక కుమారుడు జన్మించాడు.మృకండ మహర్షి పుత్రుడు కావడంతో అతనికి మార్కండేయుడు’అని పేరు పెట్టారు.ఈ ప్రదేశం ఇప్పుడు (మార్కెండయ పురం) మార్కొండపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.లో ఉంది.7 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు సప్తఋషుల మృకండ మహర్షి దర్శనానికి వచ్చారు. మార్కండేయుడు ఏడుగురు ఋషులకు నమస్కరించాడు. నమస్కరించిన మార్కండేయునికి వెంటనే,ఏడుగురు ఋషులు చిరంజీవ అని దీవించారు.మృకండ మహర్షి అది విని,తన కొడుకు నిజంగా అమరుడవుతాడా అని అడిగాడు ఏడుగురు ఋషులు మృకండ మహర్షి,మధ్య జరిగిన సంభాషణను శివుని దివ్యదృష్టితో గ్రహించారు. మార్కండేయుడిని బ్రహ్మ వద్దకు తీసుకెళ్లి కుడా చిరంజీవిగా అనుగ్రహిస్తారు.ఆ తరువాత, దివ్యదృష్టితో,మృకండ మహర్షి,శివుని మధ్య ఏమి జరిగిందో తెలుసుకుని, మార్కండేయుడిని నిరంతరం శివుడిని పూజించమని కోరాడు బ్రహ్మ కూడా శివుని కోసం తపస్సు చేసి మార్కండేయుడిని అమరుడిని చేయమని కోరాడు.నారదుడు యముడిని మార్కండేయుడిని కలవడంమృకండ మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాలు గురించి నారదుడు యముడుకి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయ్యకపొతే ప్రపంచానికి యమడి భయం పొతుందని చెప్పి మార్కండేయుని దగ్గరకు వెళ్తాడు. నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చెయ్యమని చెప్తాడు.మార్కండేయుడు చిరంజీవి అవడం విష్ణువునుపూజిస్తున్న మార్కండేయుడు16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకరులను మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. శివుడు యముడ్ని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్ధాయం కలవాడివి.నీ తండ్రి పుత్రుడిన్ని కోరుకోమన్నప్పుడు పుత్రుడ్ని ఇచ్చాను అని చెప్పాను కాని 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడ్ని ఇచ్చాను అనలేదు.ఇప్పటికి కూడా చిరంజీవిగా ఉన్నాడు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు బోడ దత్తు,ఉపాధ్యక్షులు ఒగ్గ మోహన్,గుర్రపు సత్యనారాయణ,డి రమేష్,ఒగ్గ రాములు,జి మణిక్,వెంకటేశం, సంతోష్,గడ్డపు మనోహర్,గ్రామ భక్తులు తదితరులు పాల్గొన్నారు.