Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా, స్వామి వారి ఊరేగింపు నిజాంపేట్ రోడ్డు లో ప్రతి ఏడు జరిగినట్లే జరుపుటకు, నిజాంపేట్ రోడ్డు వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు, ఊరేగింపుకు అడ్డు లేకుండా రొడ్డు ను త్వరితగతిన పూర్తి చేయాలని జి హెచ్ ఎం సి ఇంజనీరింగ్ ఏఈ రాజీవ్ ని ఆదేశించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో జరుగుతున్న సందర్భంగా ఇఓ విజ్ఞప్తి మేరకు నిజాంపేట్ రోడ్డు వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు, ఊరేగింపుకు అడ్డు లేకుండా రొడ్డు ను త్వరితగతిన పూర్తి చేయాలని జి హెచ్ ఎం సి ఏఈ కి చెప్పడం జరిగింది అని, అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని, ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలానే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదితామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఇఓ సత్యనారాయణ మరియు కాలనీ వాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.