విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్,
ఐపిఎస్*జనం న్యూస్ 18 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్విజయనగరం జిల్లా జామి పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి ఆటో నడిపి, జామి పోలీసులకు పట్టుబడిన నిందితుడు ముకుందపురం గ్రామం, వేపాడ మండలంకు చెందిన జామి స్వామి నాయుడుకు ఎస్.కోట స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గండి అప్పల నాయుడు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ నవంబరు 17 న తెలిపారు.వివరాల్లోకి వెళ్తా… జామి ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నవంబరు 17న జామిలో వినాయక గుడి వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ముకుందపురం గ్రామం, వేపాడ మండలంకు చెందిన జామి స్వామి నాయుడు మద్యం సేవించి ఆటో నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారన్నారు. పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయగా, సదరు వాహన దారుడు మద్యం సేవించి ఉన్నట్లుగా నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసారన్నారు. సదరు వ్యక్తిని జామి పోలీసులు నవంబరు 17న స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, ఎస్.కోట వారి వద్ద హాజరుపర్చారన్నారు. స్పెషల్ జ్యుడియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ గండి అప్పలనాయుడు నిందితుడు జామి స్వామి నాయుడుకు 7 రోజులు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ తెలిపారు.మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నందున ఈ తరహా నేరాన్ని తీవ్రంగా పరిగణించి, నిందితులకు జైలుశిక్ష విధించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించార


