Listen to this article

జనం న్యూస్‌ 24 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

జంఝావతి రబ్బర్ డాంలో మగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసింది. కొమరాడ (M) సివినిలో ఆదివారం జరిగిన స్నేహితుడి పెళ్లి కోసం హైదరాబాదు నుంచి ప్రతాప్ వచ్చాడు. గ్రామంలో ఉన్న మరికొందరి స్నేహితులతో కలిసి మధ్యాహ్నం జంఝావతి రబ్బర్ డాంను సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు శరత్ కుమార్, ప్రతాప్, గోవింద నాయుడు దిగి ఊబిలో కూరుకుపోయి మృత్యు వాత పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.