

సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. అబ్దుల్ రహమాన్. (జనం న్యూస్) ఫిబ్రవరి 1.
అసైన్డ్ భూములను లక్ష్యంగా చేసుకొని కొందరు అర్ధరాత్రి విచ్చలవిడిగా అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు,
హత్నూర మండల పరిధిలో మొరం మట్టి తవ్వకాలు అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా యంత్రాలతో తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొరం మట్టి, మట్టి తవ్వకాలకు ఎక్కడ అడ్డు అదుపు లేకుండా పోతుంది ,మండల పరిధిలోని దేవులపల్లి శివారులో గల గ్రామాలలో అసైన్డ్ భూముల ను లక్ష్యంగా చేసుకొని మట్టి తవ్వకాలు జరగడం సర్వ సాధారణంగా మారింది. గ్రామాలలో అడ్డు అదుపు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రెడ్డి ఖానాపూర్, నస్తీపూర్ గ్రామాల్లో ఈ మట్టి దందను కొనసాగించారు, సెలవు రోజుల్లో రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమార్కులు రెచ్చిపోతూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు లారీ టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు, అదేవిధంగా రాత్రి 11 గంటల నుండి నాలుగు గంటల వరకు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో, హిటాచీ జెసిపిల సహాయంతో మట్టిని ఇష్టానుసారంగా తోడేస్తూ మట్టి మాఫియా సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తము కొనుగోలు చేసిన భూముల్లో చదును చేసుకోవడం కోసం. అమాయక ప్రజల నుంచి అసైన్డ్ భూముల నుండి ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోజురోజుకు మొరం ,.మట్టి ,అవసరాలు పెరుగుతుండడంతో అక్రమార్కులు దాని విలువల సైతం పెంచేశారు, ఒక ట్రాక్టర్ మొరం 800 వందలు నుంచి 900 వందల వరకు ,టిప్పర్ కు వచ్చేసి 7 వేల నుంచి 8 వేల వరకు తీసుకుంటున్నారు, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మట్టిని తోడొస్తున్న అక్రమార్కుల ఆగడాలపై బ్రేకులు వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.