Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 01(నడిగూడెం)

మండల కేంద్రానికి చెందిన కుంభజడ వెంకటమ్మ భర్త శ్రీను ను అదే గ్రామానికి చెందిన అహల్య కులం పేరుతో దూషించారని ఇచ్చిన పిర్యాదు మేరకు నడిగూడెం పోలీస్ స్టేషన్ లో 27/19 లో సెక్షన్ 324,504,506,లలో 1989 యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విషయం లో శనివారం ఎస్సి, ఎస్టి కోర్టు నల్గొండ జడ్జి రోజా రమణి ఎస్సీ, ఎస్టీ యాక్ట్ సెక్షన్ ప్రకారం ముద్దాయి అహల్య కు ఆరు నెలల జైలు శిక్ష , 4000 రూపాయల జరిమాన విధించినట్లు మండల ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.