

జనం న్యూస్ ఫిబ్రవరి 2 శాయంపేట మండల్ రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలం కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద
ఎమ్మార్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ నేతృత్వంలో అణగారిన వర్గాలకు న్యాయం చేగురుతోందని ఎమ్మార్పీఎస్ మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముక్కెర ముఖేష్ మాదిగ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో లక్షల డబ్బులు, వేల గొంతుకల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ముఖేష్ మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 ఏండ్ల కాలంలో ఎంతోమంది అనగారిణ బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యశ్రీ, ఒంటరి మహిళ, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ సౌకర్యం వస్తుందంటే కేవలం కృష్ణ మాదిగ 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతోనే సాధ్యమైందని వెల్లడించారు. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఎవ్వరూ వర్గీకరణ చేయకముందే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి వర్గీకరణ చేయకుండా మాలలకు అనుగుణంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తూన్న సందర్భంగా ఈనెల 7న హైదరాబాద్ లో జరగబోయే లక్ష డబ్బులు, వేల కొంతుకల మాదిగల మహాయుధ భేరిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తుడుం వెంకటేష్ మాదిగ, అరికెల్ల దేవయ్య మాదిగ, మారెపల్లి నందం ,హరికెళ్ల ప్రసాద్, పసుల ప్రవీణ్ కుమార్, దైనంపల్లి పాపయ్య, మారపల్లి మోహన్, రంగు బాబు, తల్లి దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్, సుభాష్, మాదిగలు తదితరులు పాల్గొన్నారు….