Listen to this article

జనంన్యూస్. 28.నిజామాబాదు.

ఎన్నికల సందర్బంగా ర్యాలీలు నిర్వహించాలి అంటే సంబందించిన అధికారుల అనుమతి తప్పనిసరి. డి.జే లు పూర్తిగా నిషేధం గలదు పోలీస్ కమీషనర్ వెల్లడి.నిజామాబాదు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎవరైనా ర్యాలీ లు నిర్వహించాలి అనుకుంటే సంబందించిన రిటర్నింగ్ అధికారి మరియు పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి.అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణమవుతుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరియు నిర్వహకులు నియమాలను పాటించి, ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరుకుంటున్నాం.అదే విధంగా నిజామాబాద్ జిల్లా లో డి.జే లు వాడకం పూర్తిగా నిషేధం.శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణలో అందరి భాగస్వామ్యం అత్యంత కీలకం అని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య,ఐ.పి.ఎస్. తెలియజేయడం జరిగింది.