జనం న్యూస్ 02 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:
జిల్లాలో కొత్తగా హెచ్ఐవీ కేసులు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో ర్యాలీతో పాటు స్థానిక ఐఎంఏ హాలులో అవగాహనా సదస్సు నిర్వహించారు. అనంతరం బాధితులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనాలు చేశారు. హెచ్.ఐ.వి. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని, వారు కూడా సమాజంలో భాగమేనన్నారు.


