జనం న్యూస్ 08 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా గ్రామాల అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం ఈరోజు సంకపురం గ్రామం అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ నాయకత్వం లోనే సంకపురం గ్రామం గ్రామపంచాయతీ అయ్యిందంటే అది కేసీఆర్ పుణ్యమే బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య. ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకి ఏమీ అభివృద్ధి చేసినారని ఇవాళ మొఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు.ఈరోజు ఐజ మండలంలోని సంకాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నాగార్జున కత్తెర గుర్తుపైన ఓటు వేసి వేయించి గెలిపించాలని ఇంటింటా ప్రచారంలో పాల్గొని అభ్యర్థించడం జరిగింది.
ఎమ్మెల్సీ శ్రీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే శ్రీ విజయుడు మరియు బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య బలపరిచిన సంకపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కుర్వ నాగార్జున కత్తెర గుర్తు పైన ఓటు వేసి వేయించి భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రార్థించారు ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ…ఈరోజు సంకాపురం గ్రామం అభివృద్ధి అయింది అంటే అది కెసిఆర్ నాయకత్వమే, ఈరోజు గ్రామంలో డంపింగ్ యార్డ్ అయినా, పల్లె ప్రకృతి వనమైన, స్మశాన వాటికైనా, సిసి రోడ్ల అయిన బీటి రోడ్ అయినా, ఇంటింటికి నల్ల ఆయన డ్రైనేజీలైన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈరోజు కాంగ్రెస్ సాయం లో జరిగిన అభివృద్ధి శూన్యం.70 ఏళ్ల కాలంలో శాంక్షన్ గాని బీటీ రోడ్డు బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది 3.80 కిలోమీటర్ల వరకు 2 కోట్ల 35 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది . రాయచూరు మెయిన్ రోడ్ నుంచి సంకాపురం గ్రామం మీదుగా ఇడిగోనిపల్లి గ్రామం వరకు వయా విజయరాయ టెంపుల్ వరకు.కాంగ్రెస్ పార్టీనీ నమ్మితే నట్టేట మునిగినట్టే.చేసిన అభివృద్ధిని కొనసాగించలేని దుస్థితి కాంగ్రెస్ నాయకులది.12 ఏండ్ల క్రింద సంకాపురం ఎట్లుండే నేడు ఎట్లా ఉందో ప్రజలు భేరిజూ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను ఆసరా పింఛన్లు 4000,మహిళకు 2500,కళ్యాణ లక్ష్మీ ద్వారా తులం బంగారం,విద్యార్థులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్,కె.సి.ఆర్ కిట్టు,కంటి వెలుగు పథకాలు ఏవి అని నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండేండ్లలో మళ్ళీ బి.ఆర్.ఎస్ అధికారంలోకి వస్తుందని అభివృద్ధి కొనసాగించాలంటే నాగార్జున కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


