Listen to this article

మేడవరపు రంగనాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 3 రిపోర్టర్ సలికినిడి నాగరాజు

నివాళులు అర్పించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు

మట్టి ఖర్చులకు రూ. 10 వేలు ఆర్థికసాయం అందజేత

గుంటూరు : జర్నలిస్టు శివ శంకర్ అకాల మరణం బాధాకరం అని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు అన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు కు చెందిన జర్నలిస్టు ఎస్. శివ శంకర్ సోమవారం తెల్లవరుజామున గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలుసుకున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఆసుపత్రికి చేరుకుని మార్చురీలో ఉన్న శివ శంకర్ మృతదేహాన్ని చూసి, బాధను వ్యక్తం చేశారు. మృతికి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ధైర్యంగా ఉండాలన్నారు. మట్టి ఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ.10 వేలు ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. పిల్లల చదువుకు కూడా తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తామని, అండగా ఉంటామని భరోసాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోడపాటి సుబ్బారావు, రాజుపాలెం కోటేశ్వరరావు, మాలెంపాటి శ్రీనివాస్, గుంటూరు జిల్లా అధ్యక్షులు వాసిమళ్ల రాజేష్, కార్యదర్శి లాల్ అహ్మద్, కోశాధికారి వేరువ శివశంకర్, ఉపాధ్యక్షులు శివయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబశివరావు, కమిటీ సభ్యులు లక్ష్మణ్, బత్తుల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.