Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (JAC) ఆధ్వర్యంలో 2వ రోజు “రిలే నిరాహారదీక్ష” చేస్తున్న వారికి సంఘీభావం తెలిపి అభినందించిన.రాజంపేట జనసేన పార్టీ నాయకులు & మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు ఆయన వెంట మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, నీటి సంఘం అధ్యక్షుడు నారదాసు రామచంద్ర, విశ్రాంత పోలీసు అధికారి పూల లక్ష్మీ నరసయ్య, గూడూరు శ్రీనివాసరాజు, మౌలా, చింతల శివ & స్థానిక జనసేన నాయకులు.ఈ ఉద్యమానికి & రాజంపేట, కోడూరు నియోజకవర్గాలలోని అన్ని మండలాలలో గ్రామాలలో జరిగే నిరసన కార్యక్రమాలకు, నిరాహార దీక్షలకు పూర్తి మద్దతు ప్రకటించిన రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు