Listen to this article

జనం న్యూస్‌ 12 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసు స్టేషనులో 2023 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు, పూసపాటిరేగ మండలం పెద పతివాడ గ్రామంకు చెందిన మైనపు హరీష్ (19 సం.లు)కు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె. నాగమణి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 3,500/- లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5,00,000/- మంజూరు చేస్తూ డిసెంబర్ 11న తీర్పు వెల్లడించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.పూసపాటిరేగ మండలం పెదపతివాడ గ్రామంకు చెందిన మైనపు హరీష్ (19 సం.లు) తే. 04.07.2023న అదే గ్రామంకు చెందిన ఒక మైనరు బాలిక (8 సం.లు)ను స్కూలుకు వెళుతున్న సమయంలో కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్న కొబ్బరి తోటలోకి ఎత్తుకోనిపోయి బాలాత్కారం చేసాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై పూసపాటిరేగ పోలీసు స్టేషనులో తే. 05.07.2023న పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారన్నారు. అనంతరం, అప్పటి విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారన్నారు.నిందితుడు మైనపు హరీష్ (19 సం.లు)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 3,500/-లు జరిమాన విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5,00,000/- మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసులు తరుపున పోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం.ఖజానారావు వాదనలు వినిపించారన్నారు.ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్థవంతంగా పనిచేసిన డిఎస్పీ ఆర్.గోవిందరావు, సి.ఎం.ఎస్. హెచ్.సి. సిహెచ్. రామకృష్ణ, పూసపాటిరేగ కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎస్.రాంనివాస్, స్పెషల్ పిపి ఎం. ఖజానా రావులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.