జనం న్యూస్ 18 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
పరిసరాల పరిశుభ్రత పట్ల వీధి విక్రయ దారులు మరింత పరివర్తనతో వ్యవహరించాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. బుధవారం ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వీధి విక్రయిదారుల పరివర్తన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ సమీపం నుంచి గణేశ్ టెంపుల్ వరకు తిరిగి వీధి విక్రయదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.


