Listen to this article

బిచ్కుంద డిసెంబర్ 29 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం మల్కాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ హనుమాన్ మందిరం వద్ద నిర్వహించిన సప్త కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ హన్మంత్ షిండే గారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హనుమాన్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమాధిపతి అంతేశ్వర్ మహారాజ్ గారిని ఘనంగా సన్మానించి, వారి ఆశీర్వాదాలను స్వీకరించారు.కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమై, సప్త కార్యక్రమం విజయవంతంగా జరగాలని, గ్రామానికి సుఖశాంతులు, సమృద్ధి కలగాలని హనుమాన్ స్వామిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించారు.