

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ..
బీసీల,ముదిరాజుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు…
ముదిరాజులని బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చడనికి కృషి…
నీలం మధు ముదిరాజ్..
నర్సాపూర్ లో ముదిరాజ్ సంకల్ప భేరి సభ..
హత్నూర వద్ద ఘన స్వాగతం పలికిన మత్స్యకారులు..
రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం..
జనం న్యూస్. ఫిబ్రవరి 5. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన తో బీసీలకు సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరుగుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్ లో ముదిరాజ్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ సంకల్ప భేరి సభకు ఆయన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీసీ కులగణన తో బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి చేకూరుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ముఖ్యంగా ముదిరాజులకు పెద్ద ఎత్తున అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ముదిరాజ్ సోదరులు వినియోగించుకుని రాజకీయంగా ఎదగాలని సూచించారు. బీసీ కులగణన చేయడంతో బీసీల జనాభాలో ముదిరాజ్ ల శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉందని తేలిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజ్ ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. చాలా రోజులుగా ముదిరాజ్ సోదరులు కోరుతున్న బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే డిమాండ్ ను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని మన దీర్ఘ కాలిక డిమాండ్ పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడలేని విధంగా బీసీ కులగణనను నిర్వహించినందుకు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీసీ కులగణన నిర్వహించి బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశ,రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర మంత్రివర్గానికి తెలంగాణ బీసీ సమాజామంతా రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో. నిర్వాహకులు ముదిరాజ్ సంక్షేమ సమితి సభ్యులు బానిస నారాయణ, బాలు నర్సింలు, సురేష్,రమేష్, సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్లు గారెల శ్రీనివాస్, సుంకర బోయిన మహేష్, స్థానిక నాయకులు మాజీ జడ్పీటీసీలు సంతోష్, ఆంజనేయులు, కరే కృష్ణ, సందీప్, అంజనేయులు, సుజాత సత్యం, మనిదీప్, రాజేందర్, కిష్టయ్య,అశోక్, పలు గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, సభ్యులు, యువకులు, మత్స్యకారులు, తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.