జనంన్యూస్. 07.సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తడి-పొడి విధానం ద్వారా యాజమాన్యం, నేరుగా వరి విత్తడం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం వంటి పద్ధతులను వివరించారు. నూతన సాగు పద్ధతులను అనుసరించడం వలన పెట్టుబడి తగ్గడమే కాకుండా, కూలీల ఖర్చు సుమారు ఎనిమిది వేల రూపాయల వరకూ ఆదా అవుతుందని, సాగు సమయం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, చీడపీడల నివారణ సులభతరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఇవో శివాని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్లూ సనూత్న, ట్రైనర్ శ్రావణి, కమ్యూనిటీ ఫెసిలిటేటర్. Y. శ్రీకాంత్ జూనియర్ కమ్యూనిటీ ఫెసలిటేటర్ జడల చందన్ రైతులకు ప్రాక్టికల్ డెమోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్కోలు ఉప సర్పంచ్ ఆర్ సంపత్ మరియు వార్డు సభ్యులు అఖిల్ మరియు సిరికొండ మండల రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



