జనం న్యూస్ 08 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఎయిర్పోర్టు క్రెడిట్ తీసుకుంటే నో ఇష్యూ అని మంత్రి లోకేశ్ అన్నారు. అమర రాజాను తరిమేసినందుకు, ఎయిర్పోర్టు భూములు వెనక్కి తీసుకున్నందుకు వైసీపీకి క్రెడిట్ ఇవ్వాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఒక్క ఎకరం కూడా ప్రైవేటికి గానీ ఇతర అవసరాలకుగానీ కేటాయించడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, అపోహలు వద్దని చెప్పారు. పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయడానికి అందరూ సహకరించాలని కోరారు.


