Listen to this article

జనం న్యూస్ జనవరి 14:నిజామాబాద్ జిల్లా

ప్రజలకు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షించారు.రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన సంక్రాంతి వ్యవసాయ రంగానికి మరింత బలంచేకూర్చాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. గ్రామీణ సంప్రదాయాలు, కుటుంబ బంధాలను బలపరిచే ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు.