జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గజపతినగరం మండలం ముచ్చెర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సివిల్ కానిస్టేబుల్ టి. తిరుపతిరావు కన్నుమూశారు. జనవరి 14న విధులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరగ్గా.. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


