Listen to this article

జనం న్యూస్‌ 24 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాక్షి మీడియా ప్రతినిధి అల్లు యుగంధర్‌ను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ ఈరోజు పరామర్శించారు.ప్రమాదం జరిగిన సమయంలో వెనువెంటనే స్పందించి, యుగంధర్‌ను తన పర్యవేక్షణలో ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించేలా చేసిన మజ్జి శ్రీనివాసరావు.. ఈరోజు రాజంలోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు స్వయంగా వెళ్లారు. అక్కడ యుగంధర్ కాలికి జరిగిన శస్త్రచికిత్స (సర్జరీ) వివరాలను డాక్టర్ (వైఎస్ఆర్సిపి రాజం నియోజకవర్గ సమన్వయకర్త) తలై రాజేష్ను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో:వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి కెవి సూర్యనారాయణ రాజు రాజం నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇతర ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.