Listen to this article

జనం న్యూస్‌ 27 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఘనమైన వేడుకలో, జిల్లా అభివృద్ధికి అందించిన అసాధారణ అంకితభావం మరియు కృషికి గాను పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి. ధర్మారావు మెరిటోరియస్ సర్వీస్ అవార్డును అందుకున్నారు.జిల్లా కేంద్రంలో జరిగిన అధికారిక వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి, ఐఏఎస్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఏ.ఆర్. దామోదర్, ఐపిఎస్ మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.