Listen to this article

జనం న్యూస్‌ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు కలిసి, వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ స్టేట్ పబ్లిక్ సెక్రటరీ అశోక్ మాట్లాడుతూ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కార్మికులకు యాజమాన్యం నిర్ణయించిన జీతాలు ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్లు ఇవ్వడం లేదు. ఇచ్చే వేతనాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. కాంటాక్టర్ ద్వారా సక్రమంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతినెల 10వ తేదీలోపు జీతాలు ఆయా కాంట్రాక్టరు ద్వారా కార్మికుడి బ్యాంకు ఖాతా నందు జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి. లేబర్ ఆక్ట్ ప్రకారము కార్మికులకు రావలసిన, నేషనల్ ఆఫ్,లు ఫెస్టివల్ లీవ్స్ వర్తింపజేసే విధంగా చర్యలు కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తిరుపతి, శివ, రామారావు, నర్సియమ్మ తదితరులు పాల్గొన్నారు.