Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 19 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పవిత్ర రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో సామరస్యం ఆనందం వెళ్లి వి రియాల అని ఆకాంక్షించారు, క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరీమణులంతా నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలతో నిష్ఠంగా అల్లా ను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని అన్నారు అల్లా రక్షణ కరుణ పొందాలంటే లక్షలతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ప్రతి ఒక్కరు ఉన్న దానితో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తారని అన్నారు సేవ దృక్పథానికి సహనానికి ప్రతీకంగా ఈ పండుగను జరుపుకోవడం ఎంత సంతోషంగా ఉంటుంది అని అన్నారు ఈ మాసంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు