

జనం న్యూస్, ఫిబ్రవరి 12, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి:- ఈ రోజు ధర్మారం మండలం లోని బొమ్మరెడ్డి పల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాలలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రతలు, ఆడపిల్లల సంరక్షణ, ఉన్నత విద్య, మహిళల హక్కులు, అలాగే బేటి బచావో బేటి పడావో యొక్క ముఖ్య ఉద్దేశం వివరిస్తు , అంగన్వాడీ సేవలను, బాల్య వివాహాలను అరికట్టాలని, ఆడపిల్లల పట్ల వివక్షత చూపవద్దని, చైల్డ్ హెల్ప్ లైన్ మరియు సఖి సేవలు, PC & PNDT చట్టం, సీనియర్ సిటిజన్స్ సేవలు , పని ప్రదేశాల్లో మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించిన చట్టం, ఋతు క్రమం, సైబర్ నేరాలపై, అత్యవసర సమయంలో అవసరమయ్యే హెల్ప్ లైన్ నెంబర్ లపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ బ్లాండిన, టీచర్లు బుచ్చమ్మ, కవిత, ఆశ వర్కర్ ఆర్. లలిత, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు మరియు మహిళలు పాల్గొన్నారు.