Listen to this article

జనం న్యూస్ మార్చ్ 22 ముమ్మిడివరం

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునఃనిర్మాణానికి దాతలు, భక్తులు ఉదారంగా సహకరించాలని ముమ్మిడివరం శాసనసభ్యులు& ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు కోరారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.4 కోట్లు మంజూరు చేసిందని, చరిత్రలో నిలిచిపోయేలా ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించనున్నట్లు తెలిపారు. నిర్మాణ క్రతువులో అందరూ భాగస్వాములు కావాలని శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు