

జనం న్యూస్ 13 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : రహదారులను ఆక్రమించి ప్రజా రవాణాకు ఇబ్బందులు కలిగించే చర్యలను ఉపీక్షించబోమని మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య స్పష్టం చేశారు. విజయనగరం 20వ డివిజన్లో ఆయన బుధవారం పర్యటించారు. పర్యటనలో ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు. తాగునీటిని వృథా చేయరాదని ప్రజలకు సూచించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.